Books
Navodaya Book House
3-3-865,Opp Arya Samaj mandir,
Kachiguda,Hyderabad,
Pin Code: 500027,
Telangana,India.
Mob:+91-9000413413, Office:040-24652387
Email:NavodayaBookHouse@gmail.com
Web: www.TeluguBooks.in
Gurajada
గురజాడ
శ్రీ గరికిపాటి గురజాడగారు బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు, గరికిపాటి శారద దంపతుల ద్వితీయ కుమారుడు. వీరు పుష్య శుద్ధ సప్తమి 1992 జనవరి 12, వివేకానంద జయంతి పండుగ రోజున, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రిలో జన్మించారు. వీరు తెలుగులో ఎం.ఎ, ఎం. ఫిల్, పిహెచ్. డి చేశారు.
శ్రీగరికిపాటి గురజాడగారు 23ఏళ్ల యుక్త వయస్సులో వైకుంఠ ఏకాదశి 2015 డిసెంబర్ 20న ప్రవచన రంగంలోకి ప్రవేశించి ఇప్పటివరకు 150కి పైగా ప్రవచనాలు చేశారు. గురజాడగారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూనే ప్రవచన రంగంపై తనదైన ముద్ర వేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తూనే ఉన్నారు. చిన్న వయస్సులోనే మనుచరిత్ర, వసుచరిత్ర, కాశీఖండం వంటి ప్రౌఢమైన కావ్యాలపై, రామాయణం, శ్రీమద్భాగవతం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి ఆధ్యాత్మిక అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ప్రసంగించారు. అంతేకాకుండా వివిధ పాఠశాలల్లో, కళాశాలల్లో వ్యక్తిత్వ వికాసంపై ఎన్నో ప్రసంగాలు చేశారు.
గురజాడగారు కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాదు 2009లో నిర్వహించిన ఐ.ఎం.ఏ. తెలుగు ప్రవేశ పరీక్షలో ద్వితీయ స్థానం సాధించినందుకు అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా నగదు బహుమతిని అందుకున్నారు. అంతే కాకుండా, ఐ.ఎం.ఏ. తెలుగు (2009-2014)లో హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రథమ స్థానం సాధించినందుకు అప్పటి తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ నరసింహన్ గారి చేతుల మీదుగా బంగారు పతకంతో పాటు జవహర్లాల్ మెమోరియల్ ఫండ్ నుండి ప్రతిభాపురస్కారాన్ని కూడా అందుకున్నారు.
మనుచరిత్ర కావ్యంపై ఎం.ఫిల్ చేసిన గురజాడగారు ఆ కావ్యంపై పలుమార్లు ప్రసంగించి, మనుచరిత్ర- వ్యక్తిత్వ వికాసం అనే పుస్తకాన్ని సైతం వెలువరించారు. గురజాడగారు కవిత్రయభారతంపై పిహెచ్. డి చేశారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతంలో చిన్న కథలు అనే ధారావాహికకి శ్రీకారం చుట్టి ఆ కథలు నిత్యజీవితానికి ఉపయోగపడే విధంగా ఆధునికమైన సమన్వయం చేస్తున్నారు.
Awards
బిరుదులు | |
ప్రవచన కిరీటి | అమెరికా అవధాన భారతి |
ధారణా బ్రహ్మ రాక్షసుడు (1997) | సహస్రభారతి (1996) |
అవధాన శారద (1995) | శతావధాన గీష్పతి (1994) |
శతావధాన కళా ప్రపూర్ణ |
సత్కారాలు, పురస్కారాలు | |
రామినేని ఫౌండేషన్ వారి పురస్కారం, 2018 | పి.వి. నరసింహారావు స్మారక పురస్కారం, 2018 |
గురజాడ విశిష్ట పురస్కారం, 2016 | లోక్ నాయక్ ఫౌండేషన్ వారిచే పురస్కారం, 2015 |
శ్రీ శ్రీ సాహిత్య పురస్కారం 2013 (విశాఖ ఉక్కు కర్మాగారం) | తుమ్మల పీఠం పురస్కారం, గుంటూరు, 2012 |
ఆదిభట్ల నారాయణదాసు అవార్డు హెమ్.టి.వి వారిచే ప్రదానం, 2012 | సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ పురస్కారం, 2012 |
కొప్పరపు కవుల పురస్కారం, విశాఖపట్నం, 2011 | అభ్యుదయ ఫౌండేషన్ (కాకినాడ) వారిచే పురస్కారం, 2008 |
సహృదయ’ సాహిత్య పురస్కారం (వరంగల్లు), 2005 | నండూరి రామకృష్ణమాచార్య పురస్కారం (గుడివాడ), 2004 |
తెలుగు విశ్వ విద్యాలయం వారిచే పురస్కారం, 2003 | ‘సాధన సాహితీ స్రవంతి’ పురస్కారం, ( హైదరాబాదు), 2002 |
తెలుగు విశ్వ విద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారం 2000 | ఎం.ఫిల్ లో యూనివర్సిటీ ఫస్టు సాధించినందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ ద్వారా 2 స్వర్ణ పతకాల బహూకరణ, 1989 |
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ప్రావీణ్యానికి గాను కందుకూరి వీరేశలింగం మరియు |
Calendar
Events
యూట్యూబ్ గేలరీ






















































































































































































































































శ్రీ గరికిపాటి
శ్రీ గరికిపాటి
మహా సహస్రావధాని, ప్రవచన కిరీటి, పద్యధారణలో ప్రపంచ రికార్డు స్థాపించిన డా. గరికిపాటి నరసింహారావు భాద్రపద శుద్ద పాడ్యమి సెప్టెంబర్ 14వ తేదీ 1958 వ సంవత్సరం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం తాలూకా, బోడపాడు అగ్రహారంలో శ్రీ వెంకట సూర్యనారాయణ, శ్రీమతి రమణమ్మ దంపతులకు జన్మించారు. ఈయన ఎం.ఎ., ఎం.ఫిల్., పి.హెచ్.డి. చేశారు.
1992 సంవత్సరంలో విజయదశమి రోజున అవధాన రంగంలోకి ప్రవేశించి ఇప్పటి వరకు ౩౦౦కి పైగా అష్టావధానాలు చేశారు. 8 అర్ధశత – శత – ద్విశత అవధానాలు విజయవంతంగా నిర్వహించారు. 1996 మే నెల కాకినాడ పట్టణంలో 1116 మంది పృఛ్ఛకులతో 21 రోజులపాటు 750 పద్యాలు ఏకధాటి ధారణతో మహా సహస్రావధానిగా పేరుపొందారు. అందుకే ఆయన అసాధారణ ధారణా సంపత్తికి నిలువుటద్దంగా ‘ధారణా బ్రహ్మరాక్షసుడు, ‘అమెరికా అవధాన భారతి’ వంటి బిరుదులను చెప్పవచ్చు. ఎన్నో పురస్కారాలను సన్మానాలను అందుకున్నారు.ప్రత్యేకించి 1116 పద్యాలు (5000 పంక్తులు) కలిగిన స్వీయ కావ్యం ‘సాగరఘోష’ ను 8గంటల్లో ఏకధాటి మహాధారణ చేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. అంతేకాకుండా అమెరికాలో 8 కంప్యూటర్లతో అష్టావధానాన్ని 2001 లో నిర్వహించి ఔరా అనిపించారు.బెంగుళూరు ప్రయోగశాలలో మేథాపరీక్షావధానం కూడా 2006 లో జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లోనే కాక ఎన్నో దేశాలు పర్యటించి తమ వాగ్ధాటితో, అష్టావధానాలతో, ఛలోక్తులు, చమత్కారాలతో నేటి యువతకు కూడా ఉపయోగపడే విధంగా వ్యక్తిత్వ వికాస అంశాలను జోడించి అనేక ప్రసంగాలను ఇస్తూ వస్తున్నారు.నిత్యం టి.వీలలో భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందూమతం విశిష్టతను తెలియజెప్పడంలో వారివంతు సహకారాన్నిఅందజేస్తున్నారు. సాగరఘోష, ధారధారణ, మా అమ్మ, శతావధాన భాగ్యం, అవధాన శతకం వంటి ఎన్నో పుస్తకాలను రచించారు. వారి ప్రసంగాలు సీ.డీ.లు, డీ.వీ.డీల రూపంలో కూడా తీసుకువచ్చి భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే రీతిలో కృషి చేస్తున్నారు.
గరికిపాటి వారి రచనలపై పరిశోధనలు:సాగరఘోష పై 2 ఎం.ఫిల్సుసాగరఘోష కావ్యం – సామాజికాద్వైతం శ్రీ గరికిపాటి వారి సాగరఘోష పై డా. తలారి వాసు గారి పి.హెచ్.డి
అవధానం
సప్తవర్ణాలు కలిసి ఇంద్రధనుస్సై పండిత పామర రంజకమైనట్లే పద్యం, ధార, ధారణ, చమత్కారం, కవిత్వం, సంప్రదాయం, సమస్యాపూరణం అనే ఏడు విశిష్ట లక్షణాల అద్భుతమైన మనోహరమైన సమాహారమే అవధానమనే సాహిత్య ప్రక్రియ.
తెలుగువారికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన సాహిత్య ప్రక్రియ.ఇప్పటికీ తెలుగువారికి మాత్రమే సొంతమైన ప్రక్రియ.ప్రఖ్యాత జంట కవులుగా మాత్రమే కాక, జంట అవధానులుగా పేరు పొందిన తిరుపతి వేంకటకవుల వల్లనే పద్యం ద్వారా చెప్పే భావం సామాన్య ప్రజల హృదయాన్ని తట్టి లేపింది. అక్షర జ్ఞానం లేని వాళ్ళు కూడా నాడు తిరుపతి వేంకట కవుల పద్యాలు పంటపొలాల్లో పరవశించి రాగయుక్తంగా పాడేవారంటే… అది ‘అవధాన’ ప్రభావం అనేది అతిశయోక్తి కాదు.పరిపూర్ణ సామాజిక స్పృహ ఉన్న సాహితీ ప్రక్రియ అవధానం ఒక్కటే. పండిత పామర రంజక సాహితీ ప్రక్రియ అవధానం.
డా|| గరికిపాటి వారి అవధానం: అవధానాల్లో సమస్యా పూరణాలంటే పెంకి గుఱ్ఱాల మీద స్వారీ వంటిది. వీటి నిర్వహణలో డా||గరికిపాటి వారికి ఒక ప్రత్యేకత ఉంది. ఎంత జగమొండి సమస్యల్నైనా మనం ముక్కుమీద వేలువేసుకొని విస్తుపోయే విధంగా పూరించడం వీరి ప్రత్యేకత.పృఛ్ఛకుడు అవధాని భరతం పట్టడానికి సమస్య ఇస్తే అది వారికే తగిలేలా వీరి పూరణ వస్తుంది. అవధాని నుండి ఒక రసవత్తరమైన పద్యం రాబట్టడానికి ఇస్తే అదే పద్ధతిలో వీరి పూరణ ఉంటుంది. సమస్యలని బట్టి పద్య పూరణ అంతే స్థాయిలో చెయ్యగల సమర్ధులు.అవధానాన్ని ఒక తపస్సులా భావించి తదేక పవిత్ర దీక్షతో శారదాదేవి కటాక్ష సిద్ధిని పొందిన అవధాని డా||గరికిపాటి నరసింహా రావు.1992 విజయ దశమి నాడు అవధాన రంగప్రవేశం చేసి ఇంతవరకు 275 కి పైగా అష్టావధానాలు, 8 అర్ధ శత, శత, ద్విశత సహస్రావధానాలు సమర్ధవంతంగా నిర్వహించించి అవధాన బ్రహ్మ రాక్షసుడు వంటి విశిష్టమైన బిరుదులను, అనేకనేక సన్మానాలను, పురస్కారాలను అందుకున్నారు




మహా సహస్రావధానం, వరల్డ్ రికార్డు స్థాపన:


1996 మే నెల కాకినాడలో మహా సహస్రావధానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 116 మంది పృఛ్ఛకులు 21 రోజుల్లో 750 పద్యాలను ఏకధాటి ధారణతో చేయడం జరిగింది. ఈ సందర్భంగా వరల్డ్ రికార్డు కూడా సాధించడం జరిగింది..
హైటెక్ అవధానం: 2001 వ సంవత్సరంలో అమెరికాలో 8 కంప్యూటర్లతో అష్టావధానం2006 వ సంవత్సరం బెంగుళూరు లోని ప్రయోగశాలలో అవధానం నిర్వహిస్తూండగా మేధో పరీక్ష నిరణ.
Home


శ్రీ గరికిపాటి
మహా సహస్రావధాని, ప్రవచన కిరీటి, పద్యధారణలో ప్రపంచ రికార్డు స్థాపించిన డా. గరికిపాటి నరసింహారావు భాద్రపద శుద్ద పాడ్యమి సెప్టెంబర్ 14వ తేదీ 1958 వ సంవత్సరం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం తాలూకా, బోడపాడు అగ్రహారంలో శ్రీ వెంకట సూర్యనారాయణ, శ్రీమతి రమణమ్మ దంపతులకు జన్మించారు. ఈయన ఎం.ఎ., ఎం.ఫిల్., పి.హెచ్.డి. చేశారు.
1992 సంవత్సరంలో విజయదశమి రోజున అవధాన రంగంలోకి ప్రవేశించి ఇప్పటి వరకు ౩౦౦కి పైగా అష్టావధానాలు చేశారు. 8 అర్ధశత – శత – ద్విశత అవధానాలు విజయవంతంగా నిర్వహించారు


గరికిపాటి గురజాడ
శ్రీ గరికిపాటి గురజాడగారు బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు, గరికిపాటి శారద దంపతుల ద్వితీయ కుమారుడు. వీరు పుష్య శుద్ధ సప్తమి 1992 జనవరి 12, వివేకానంద జయంతి పండుగ రోజున, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రిలో జన్మించారు. వీరు తెలుగులో ఎం.ఎ, ఎం. ఫిల్, పిహెచ్. డి చేశారు.
శ్రీగరికిపాటి గురజాడగారు 23ఏళ్ల యుక్త వయస్సులో వైకుంఠ ఏకాదశి 2015 డిసెంబర్ 20న ప్రవచన రంగంలోకి ప్రవేశించి ఇప్పటివరకు 150కి పైగా ప్రవచనాలు చేశారు. గురజాడగారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూనే ప్రవచన రంగంపై తనదైన ముద్ర వేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తూనే ఉన్నారు. చిన్న వయస్సులోనే మనుచరిత్ర, వసుచరిత్ర, కాశీఖండం వంటి ప్రౌఢమైన కావ్యాలపై, రామాయణం, శ్రీమద్భాగవతం, శివానందలహరి, సౌందర్యలహరి వంటి ఆధ్యాత్మిక అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ప్రసంగించారు. అంతేకాకుండా వివిధ పాఠశాలల్లో, కళాశాలల్లో వ్యక్తిత్వ వికాసంపై ఎన్నో ప్రసంగాలు చేశారు.